బీజేపీ ,ఎలెక్షన్ కమిషన్ నిజంగానే కుమ్మక్కు అయిందా ? ఎలెక్షన్ కమిషన్ కాపీపై బీజేపీ స్టాంప్ ఎందుకు ఉంది మరి? సోషల్ మీడియాలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలో నిజం ఉందా? బీజేపీ,ఎలెక్షన్ కమిషన్ నిజంగానే ఒకే ఆఫీస్ కేంద్రంగా పని చేస్తున్నాయా ? ఈ ఆరోపణలకు సమాధానం ఇది..
వివాదానికి కారణం అయింది ఈ లెటరే!

ఈ లెటర్ బీజేపీ ఆఫీస్ నుంచే ప్రింట్ అయింది అని అందుకే బీజేపీ స్టాంప్ ఉందని..ఈసీని బీజేపీనే డిక్టేట్ చేస్తుందని,ఈసీ,బీజేపీ కుమ్మక్కు అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.
అసలు ముచ్చట ఏంటంటే ?
ఎలక్షన్ కమిషన్ లేఖపై స్పష్టీకరణ – ఏమైంది?
ఎలక్షన్ కమిషన్ ఒక లేఖపై BJP ముద్ర (seal) ఉండటంతో అది వార్తల్లో వచ్చింది. దీనిపై ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అధికారికంగా ఇలా చెప్పింది:
అసలు విషయం ఏమిటంటే:
- BJP కేరళ యూనిట్ 2019లో ఉన్న ఒక గైడ్లైన్ గురించి ఎలక్షన్ కమిషన్ ఆఫీసును అడిగింది.
- వారు 2019లో వచ్చిన అసలు గైడ్లైన్ ఫోటోకాపీ ఇచ్చారు.
- ఆ ఫోటోకాపీపై BJP పార్టీ ముద్ర ఇప్పటికే ఉంది (వాళ్లు ఇచ్చిన కాపీ కాబట్టి).
- ఆఫీస్ వారు గమనించకుండా అదే కాపీని ఇతర పార్టీలకు కూడా పంపించారు.
- తర్వాత ఈ తప్పు గుర్తించి వెంటనే మార్చి 21న ఆ లేఖను వెనక్కి తీసుకున్నారు.
ఎలక్షన్ కమిషన్ చెప్పింది:
- ఇది కేవలం clerical error (ఆఫీస్ పొరపాటు) మాత్రమే.
- ఎలాంటి రాజకీయ జోక్యం లేదు.
- ఎన్నికల ప్రక్రియ పూర్తిగా స్వతంత్రంగా ఉంటుంది.
- ప్రజలు, మీడియా తప్పుగా ప్రచారం చేయవద్దు అని చెప్పారు.
రిసీవ్ స్టాంప్ జిరాక్స్ అని కనబడుతున్నా 2019 ఫోటోని ఇప్పుడు ప్రచారం చేస్తూ జనాలలో ఫేక్ వార్తలు సృష్టిస్తూ బీజేపీని బదనాం చేయాలని కావాలనే తప్పుడు ప్రచారానికి దిగజారుతున్నరు.
2019 లో కేరళలో అధికారంలో ఉంది ఎవరు? కేరళ లో బీజేపీ,ఈసీ కుమ్మక్కు అయితే బీజేపీ గెలవాలి కానీ కమ్యూనిస్టులు ఎలా గెలిచారు.దీనినే కోడిగుడ్డు మీద ఈకలు పీకడం అంటారు. ఇది బీజేపీ,ఈసీ స్టాంప్ ముచ్చట..
జాతీయవాద గొంతుక Rightvoice.in ని తప్పకుండా సపోర్ట్ చేసి షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి.
