రాజకీయాల్లో గెలవడానికి ఎన్నెన్నో హామీలు,మాయమాటలు చెప్పి గెలుస్తుంటారు.గద్దెనెక్కుతారు..మెజారిటీ నాయకులు ఇచ్చిన హామీలను అసలు గుర్తు పెట్టుకోరు..పెట్టుకున్నా అమలు చేయాలనే ఆలోచన,ఆచరణ ఉండవు..
అలాగే ఓటు వేసేదేకా ఓటర్లను ఏవేవో చెప్పి ప్రసన్నం చేసుకుంటారు..ఓటు వేసాక,గెలిచాక పనుల కోసం వస్తే తిప్పించుకుంటారు..ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయ నాయకుల ఊసరవెల్లి ముచ్చట్లు ఒడవవు..
కానీ హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో లో బీజేపీ నుంచి గెలిచిన కౌన్సిలర్ పంజాల మనోజ్ గౌడ్ మాత్రం తాను అందరిలాగా కాదు నేను డిఫరెంట్ అని నిరూపించాడు.
గెలిచి వారం కూడా కాకముందే ఇచ్చిన హామీలను అమలు చేసేస్తున్నాడు.

వివరంగా చెప్పుకుంటే పంజాల మనోజ్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ 21వ వార్డు నుంచి బీజేపీ తరపున పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలిచాడు.ఎన్నికల ప్రచారంలో వార్డు అభివృద్ధి కోసం మ్యానిఫెస్టో కూడా పెట్టాడు..అందులో అందరినీ ఆకర్షించిన రెండు హామలు మనోజ్ సేవాభావాన్ని తెలియజేసాయి.
- ఆడబిడ్డ పుడితే 10116/-రూపాయలు ఫిక్సుడ్ డిపాజిట్ చేస్తానని..
- ఆడబిడ్డ పెళ్లికి 10116/-రూపాయలు కానుకగా ఇస్తానని..
తన మ్యానిఫెస్టో ఇది..

హామీ ఇవ్వడం వేరు..అమలు చేయడం వేరు..
కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి పెళ్లి కుదిరిన ఆడబిడ్డకు 10116/- రూపాయలు కానుకగా ఇచ్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు..ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజలతోటి శభాష్ అనిపించుకుంటున్నాడు.

మనోజ్ కేవలం ఎన్నికల కోసమే,గెలవడం కోసమే ఇలాంటి హామీలు ఇవ్వలేదు.చాలా ఏళ్లుగా పేదవారికి,పేదపిల్లలకి అండగా నిలుస్తున్నాడు.తనకు అవకాశమున్నంత వరకు ఆసరా అవుతాడు..అన్న అవుతాడు.ముద్దుగా ఆ వార్డు ప్రజలు మనోడిని,మనోజ్ ని బంటి అని పిలుసుకుంటారు.గ్రేట్ బంటి భాయ్..కీప్ అప్ ది గుడ్ వర్క్

