ఎస్టీ రిజర్వ్డ్ సీట్లో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్.
అదిలాబాద్ (ఎస్టీ) స్థానానికి రెండు సార్లు పెద్దపల్లి (ఎస్సీ) నుండి టీడీపీ టికెట్ మీద గెలిచిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన చెల్లమల్ల సుగుణ కుమారి పేరుని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ.

ఇప్పటికే తెలంగాణలో లోక్సభ ఎన్నికల టికెట్ల ఖరారులో వెనకబడ్డ కాంగ్రెస్ పార్టీలో ఈ పరిణామం సరికొత్త అయోమయానికి దారి తీసింది.
సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వడంతో అభ్యర్థి పేరును మార్చి మళ్ళీ కొత్త జాబితాను విడుదల చేసింది.

తెలంగాణ కాంగ్రెస్ లోకసభ అభ్యర్థుల జాబితా విడుదలైంది. నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది
- నిజామాబాద్ – టి.జీవన్ రెడ్డి
- మెదక్ – నీలం మధు ముదిరాజ్
- భువనగిరి – చామల కిరణ్ కుమార్ రెడ్డి
- ఆదిలాబాద్ – ఆత్రం సుగుణ