తెలంగాణలో మాదిగలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ..
మొన్న డిసెంబర్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగ సమాజం అంతా కాంగ్రెస్ వెంట నడిచింది.కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మాదిగ సమాజం అందించిన సహకారాన్ని అప్పుడే కాంగ్రెస్ పార్టీ మరిచిపోయింది.ద్రోహం చేసింది.
17 పార్లమెంట్ సీట్లల్లో 3 SC రిజర్వుడు సీట్లు ఉన్నాయి..
ఇందులో పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కొడుకు వంశీకి (మాల) టికెట్ కేటాయించింది.
నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి(మాల) కి కేటాయించింది.
నిన్న BRS నుంచి కాంగ్రెస్ లో చేరిన కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య కి టికెట్ కేటాయించడం జరిగింది.SC బైండ్ల సామాజిక వర్గానికి కేటాయించింది.
ఈ లెక్కన 3 SC నియోజకవర్గాల్లో ఒక్క సీటు కూడా మాదిగ సమాజానికి ఇవ్వకుండా ద్రోహం చేసింది.దాదాపు 40 లక్షల ఓట్లు ఉన్న మాదిగలకు ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం మాదిగలను విస్మరించినట్టే అని మాదిగలు వాపోతున్నారు..
ఇప్పటికే SC వర్గీకరణపై బీజేపీ హామీ ఇచ్చినందున మాదిగ సమాజం అంతా బీజేపీ వెంట నడిచే అవకాశం కనిపిస్తోంది..
కాంగ్రెస్ చేసిన ద్రోహానికి గుణపాఠం చెప్పాలని మాదిగ సమాజం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది.