మాధవీలతపై మోడీ ప్రశంసల వర్షం

నరేంద్రమోడీ గారు హైదరాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి మాధవీలతపై ప్రశంశల వర్షం కురిపించారు.ట్విట్టర్(X) లో మాధవీలత ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు..

విషయం ఏమిటంటే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవిలతను ప్రకటించిన విషయం తెలిసిందే.అసదుద్దీన్ ఓవైసీపై గట్టి పోటీ ఇచ్చే విధంగా విరించి హాస్పిటల్ అధినేత ప్రముఖ సామాజిక కార్యకర్త మాధవీలతను ప్రకటించిన తర్వాత ఆమె చర్చనీయాంశం అయింది. ఏ యూట్యూబ్ ఇంటర్వ్యూ,న్యూస్ ఛానెల్స్,సోషల్ మీడియా లోనైనా ట్రెండింగ్ లో ఉంది..

ఇప్పుడు ప్రముఖ హిందీ న్యూస్ షో,ప్రముఖ జర్నలిస్టు రజత్ శర్మ నిర్వహించే ‘ఆప్ కీ అదాలత్ ‘ లో మాధవీలత పాల్గొన్నది..

హిందూ ధర్మం,హైదరబాద్ ఓల్డ్ సిటీ,అసద్దుదిన్ ఓవైసీకి సవాళ్లు విసిరిన నైజం, ఏ మాత్రం సంకోచం లేకుండా అద్భుతంగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిన మాధవీలత ఇంటర్వ్యూని చూసి మోడీ ట్వీట్ చేశారు.ప్రతీ ఒక్కరూ చూడవలసిన అద్భుతమైన ఇంటర్వ్యూ అని,అర్థవంతంగా,బలంగా మీ అభిప్రాయాలను నిర్భయంగా మాట్లాడారు అని మాధవీలతను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు..

ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయింది.
మీరు ఒక్క లుక్ ఏయండి ఇంటర్వ్యూ పై!

జై హింద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *