3 కోట్ల 50 లక్షల రూపాయల అభివృద్ది పనులు ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

కరీంనగర్ పార్లమెంట్ లోని చొప్పదండి నియోజకవర్గం, కొడిమ్యాల మండలంలో రూ.3కోట్ల 50లక్షల కేంద్ర నిధులతో వివిధ రోడ్లు, అభివృద్ధి పనులను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రారంభించడం జరిగింది.

అందులో భాగంగా కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి అంగడి బజార్ వరకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రూ.65లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించడం జరిగింది. అలాగే రూ.2కోట్ల 59లక్షల నిధులతో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో సీసీ రోడ్లను నిర్మానం. మరోపక్క ఎంపీ లాడ్స్ నిధుల కింద కిచెన్ షెడ్స్, కమ్యూనిటీ హాల్స్, పీఏసీఎస్ భవనాల అభివృద్ధి పనులు చేసిన బండి సంజయ్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *