నేడు హోంశాఖ కీలక సమావేశం!
న్యూ ఢిల్లీ:మే 06
కేంద్ర హోంశాఖ ఈరోజు ఉదయం 10:45 నుండి 12 గంటల వరకు ముఖ్యమైన సమా వేశం నిర్వహించనుంది. పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలోని 244 జిల్లాల్లో పౌర రక్షణ సన్నాహాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, పౌర రక్షణ శాఖల అధిపతులతో కేంద్ర హోంశాఖ వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించనుంది. హోంశాఖ కార్యదర్శి, సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు..
దేశ ప్రజలు ముక్తకంఠంతో పాకిస్తాన్ పై యుద్ధం చేయాలని,పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పాలని కోరుతున్న విషయం తెలిసిందే!!